PPM: పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, మ్యుటేషన్లు, రీ-సర్వే ప్రక్రియలో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి సర్వేయర్లను ఆదేశించారు. ఎక్కడా గడువు మించకుండా పారదర్శకంగా పనులు జరగాలని సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జేసీ యశ్వంత్ కుమార్ ఇవాళ డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు.