NDL: పాణ్యం మండలం కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇవాళ టీటీడీ బోర్డు సభ్యుడు, జడ్పీ మాజీ ఛైర్మన్ మల్లెల రాజశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామకృష్ణ, అర్చకులు మర్యాదలతో వారికి స్వాగతం పలికి స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేసి, శేష వస్త్రంతో సత్కరించారు.