నిర్మల్ జిల్లా జడ్జి శ్రీ వాణిని ఖానాపూర్ బార్ నూతన అధ్యక్షుడు మట్టేరీ రాజశేఖర్, న్యాయవాదుల బృందం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. నూతన అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.