MDK: నర్సాపూర్ రైతు వేదికలో మంగళవారం సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ మాట్లాడుతూ.. నిరంతరం ఒకే రకమైన పంటలు వేయడం వల్ల భూమిలో పోషకాలు తగ్గిపోతాయని హెచ్చరించారు. రైతులు పంట మార్పిడి పద్ధతులను పాటించడం వల్ల నేల సారం పెరిగి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించవచ్చని వివరించారు.