PDPL: రామగుండం పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ &డ్రైవ్లో దొరికిన ఏడుగురిని గోదావరిఖని కోర్టులో సోమవారం హాజరు పరిచినట్లు ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. వారిలో ఆరుగురికి రూ. 2 వేల చొప్పున జడ్జి వెంకటేశ్ దుర్వా జరిమానా విధించారని, 2 సారి పట్టుబడిన ఓ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. అతడిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించామన్నారు.