NDL: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి. కృష్ణ మోహన్, జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి, జస్టిస్ ఎ. హరి హరనాథ శర్మ శనివారం నందికొట్కూరులో అదనపు JFCM కోర్టు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.