CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ (RTI) చావలి సునీల్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రం చిత్రపటాన్ని ఆలయ ఏఈవో రవీంద్రబాబు అందజేశారు.