మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని వ్యవసాయ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల ఓరియంటేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముందుగా దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక పాలకవర్గం సమర్థవంతమైన పాలన అందించాలన్నారు.