ADB: నార్నూర్ మండలం కొత్తపల్లి మాల్కుగూడలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కనక భీంరావ్కు చెందిన గోధుమ, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. సాయంత్రం కురిసిన భారీ వర్షం, బలమైన గాలుల వల్ల పంట పొలం నాశనమైందని రైతు తెలిపారు. ఈ సంఘటన రైతుకు తీరని నష్టాన్ని కలిగించింది.