SDPT: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని భూంపల్లిలో మండల మహిళా సమైక్య భవనానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు బలోపేతం కావాలని, స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.మహిళల సాధికారత కోసం ఇలాంటి భవనాలు ఉపయోగపడతాయని తెలిపారు.