WGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రి కొండా సురేఖకు అధికారులు, అర్చకులు ఆహ్వానం అందజేశారు. భక్తులకు సౌకర్యాల కల్పన, భద్రతా ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, దేవస్థానం అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.