PDPL: ఈనెల 19న 2026 -27 విద్యా సంవత్సరానికి ధర్మారం మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి ప్రవేశం కోసం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10 తరగతుల కోసం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.