NRML: అమావాస్య తిథిని పురస్కరించుకుని పట్టణంలోని కాలభైరవ స్వామి ఆలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. కాలభైరవ స్వామికి అమావాస్య రోజు పూజారి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల దుష్టశక్తులు దూరమవుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ సందర్భంగా భక్తులు తెలిపారు.