ADB: రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏఒక్కటి అమలు చేయలేదని, పాలనా చేయడం చేతకాకుంటే రాజీనామా చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు భిక్కు రాథోడ్ అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 హామీలు అమలు చేయకుంటే జిల్లా కేంద్రంలో భారీగా ధర్నా, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.