HYD: పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా అంబర్పేట డివిజన్ ఎంసీహెచ్ కాలనీలో ముస్లీం ప్రజలకు ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ వేడుకలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని MLA సూచించారు.