NGKL: వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో రాత్లవత్ రాములు (91) మరణించారు. SI మహేశ్ తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఐ20 కారు పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న రాములను బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.