KMR: బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రం అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆయనను ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. అనంతరం బాధితుడిని మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.