MNCL: చెన్నూరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. పనులను పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు ఆసుపత్రిని అందించాలని కోరారు.