SRD: నిజాంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. సుమారు 25 ఏళ్ల తర్వాత స్నేహితులంతా ఒకేచోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. పాత మిత్రుల పలకరింపుతో ప్రాంతమంతా సందడి నెలకొంది.