MNCL: మందమర్రి ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్మెంట్లపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. గుర్తింపు AITUC సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరుగునున్న ‘సేవ్ సింగరేణి’ కార్యక్రమానికి కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నారు. ముట్టడికి మద్దతుగా కార్మికులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి, యాజమాన్యాలకు వ్యతిరేఖంగా నిరసన తెలిపారు.