BHPL: ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శుక్రవారం భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు వారిచే పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేసి అనంతరం ఆలయ పరిరక్షణ కమిటీ తరుపున ఘనంగా సత్కరించారు.