WGL: జిల్లా కలెక్టరేట్లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖకు 74, GWMCకి 25, ఇతర శాఖలకు 67 దరఖాస్తులతో కలిపి మొత్తం 166 వినతులు అందయని తెలిపారు. సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జూమ్ మీటింగ్ ద్వారా తాహసీల్దార్లతో మాట్లాడారు.