SRPT: సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని కేటీ అన్నారం క్రాస్ రోడ్ వద్ద గల జీకే వైన్స్లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని దుండగులు షాపు పైకప్పు ఇనుప రేకులు ఊడదీసి లోపలికి చొరబడ్డారు. కౌంటర్లో ఉన్న రూ.14,500 నగదుతో పాటు ఐదు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. క్యాషియర్ నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాలు తెలిపారు.