NGKL: మరికల్ మండలం పూసలపాడు గ్రామానికి చెందిన పాలెం నిరంజన్కు మంజూరైన CMRF చెక్కును ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ఆర్థిక సాయం అందిందని ఆయన పేర్కొన్నారు. ఆపద సమయంలో తమకు అండగా నిలిచిన ఎమ్మెల్సీకి, మాజీ ఎమ్మెల్యేకు లబ్ధిదారుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.