KNR: జమ్మికుంటలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు గుడివాడ వెంకట సతీష్ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర సాధనలో పొట్టి శ్రీరాములు త్యాగం మరవలేనిదని పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు మజ్జిగ, చల్లటి నీళ్లు పంపిణీ చేశారు.