RR: శంషాబాద్ మండలం, నర్కూడ గ్రామంలో ఇవాళ బొడ్రాయి ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా, గ్రామ సర్పంచ్ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్రాయికి అభిషేకం చేసి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నర్కూడ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.