VKB: తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, పూర్తయిన ఇళ్లకు గృహప్రవేశ ఏర్పాట్లు చేయాలని సూచించారు.