BHNG: బాల్య వివాహల నిర్మూలన కొరకు స్కోప్ స్వచ్ఛంద సంస్థ ప్రచార రథం మోత్కూరు మండల కేంద్రంకు విచ్చేసిన సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవింద రాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మార్వో జ్యోతి హాజరై మాట్లాడుతూ.. బాల్య వివాహల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.