JGL: కోరుట్ల శివారులోని D40 కాలువలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతను ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లికి చెందిన రాజ్ కుమార్ (38)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.