NRPT: మరికల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 204 మంది విద్యార్థులకు గాను 197 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 7 మంది విద్యార్థులు పరీక్షకు గైహాజరైనట్టు ప్రిన్సిపల్ నాగమణి మాల తెలిపారు. పరీక్షల సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు.