ATP: రాయదుర్గం పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ.30 లక్షలతో పైప్లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 32వ వార్డులోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో రూ.30.65 లక్షలతో సీసీ రోడ్డు పనులను మొదలుపెట్టామన్నారు.