సత్యసాయి: జిల్లా వ్యాప్తంగా నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రాత్రి ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీస్ అధికారులు సభలు ఏర్పాటు చేసి మహిళా భద్రత, మాదక ద్రవ్యాల అనర్థాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు. బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై వివరిస్తూ కొత్త వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.