E.G: అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ మహిళా కార్యకర్త చౌట జయలక్ష్మికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల చౌదరి ఆర్థిక సాయం అందించారు. ఆమె మోకాళ్ల సర్జరీ కోసం తిరుపతి బర్డ్ ఆస్పత్రి అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సోమవారం సూచించారు. తక్షణ ఖర్చుల కోసం రూ.10,000 అందజేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.