శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 400 హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు దాబాలు కొనసాగుతున్నాయి. వాటి ద్వారా సుమారు 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వాణిజ్య సిలెండర్ల కొరత కారణంగా ఇప్పటికే దాదాపు సగం హోటల్లు మూత పడ్డాయి. పూర్తిగా మూతపడితే ఆయా కుటుంబాలన్నీ రోడ్డున పడాల్సి వస్తుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.