KMR: మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెస్తున్న వారిపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. SP రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 119 మందికి శుక్రవారం కోర్టు జరిమానాతో పాటు శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసుల్లో నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రూ.1,18,100 జరిమానా విధించింది.