WNP: శ్రీరంగపురం మండల కేంద్రంలోని శ్రీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మూలమంత్ర హవనం, అనంతరం శేషవాహనంపై తిరువీధి సేవ నిర్వహించనున్నట్లు అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారి దర్శనం చేసుకోవాలని వారు కోరారు.