NRML: నిర్మల్ కలెక్టరేట్లో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పాపన్న గౌడ్ను పీడిత వర్గాల కోసం పోరాడిన మహానీయుడిగా కొనియాడారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.