జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లిలో శ్రీ రేణుకా ఎల్లమ్మ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, బోనాల పండుగ, పట్నాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గౌడ సంఘం సభ్యులు, గ్రామ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. మహిళలు బోనాలు సమర్పించారు.