PDPL : నగదు రహిత లావాదేవీలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని కెడిసిసి బ్రాంచ్ ఆధ్వర్యంలో ‘ఆర్థిక అక్షరాస్యత – నగదు రహిత’ లావాదేవీలపై మంథని మండలంలోని పుట్టపాక గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి చైర్మన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డిఈ దిలీప్, పాల్గొన్నారు.