నెల్లూరు: జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం, సంఘం మండలాల్లో పాల డైరీలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాలలో కొవ్వు శాతం అధికంగా చూపించేందుకు అన్య పదార్థాలు కలుపుతున్నారని ఆరోపణ రావడంతో తనిఖీలు చేపట్టామని ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.