KDP: దువ్వూరులో శుక్రవారం జిల్లా విజిలెన్స్ అధికారులు భారీగా గుట్కాను పట్టుకున్నారు. హైదరాబాదు నుంచి ప్రొద్దుటూరుకు లారీలో గుట్కా రవాణా అవుతుండగా దువ్వూరులో పట్టుకున్నారు. 5 గుట్కా బండిల్లు పట్టుకుని, రూ.1.50 లక్షలు పెనాల్టీ విధించారు. జీరోలో రవాణా అవుతున్న ఇతర వస్తువులకు మరో రూ.1.65 లక్షలు పన్ను విధించారు.