అన్నమయ్య: మదనపల్లి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో జనగణన గణాంకాలు కీలకమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జనగణన దశ-1, గృహ జాబితా శిక్షణలో పాల్గొని మాట్లాడారు. ఖచ్చితమైన సమాచార సేకరణతోనే సంక్షేమ పథకాల అమలు సాఫీగా సాగుతుందన్నారు. ఈసారి సెల్ఫ్ ఇన్యూమరేషన్ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.