భారత మార్కెట్లో స్మార్ట్ఫోన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మెమరీ చిప్ల కొరత, AI సాంకేతికత వాడకం పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో బడ్జెట్ ధరలో దొరికిన ఫోన్లు ఇప్పుడు ఖరీదైనవిగా మారుతున్నాయి. చిప్ తయారీదారులు ఏఐ కంపెనీలపై దృష్టి పెట్టడంతో సరఫరా తగ్గి ధరలు పెరిగాయి. ఈ ప్రభావం ఫోన్లతో పాటు ల్యాప్టాప్లు, టీవీలపై కూడా పడనుంది.