నిన్న హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లిలో రష్మిక ఎర్ర(కుంకుమ) రంగు చీరలో మెరిసిపోయింది. కాగా, సెలబ్రిటీలు అందరూ వారి పెళ్లిళ్లో ఎరుపు రంగు చీర కట్టుకోవడం విశేషం. నయనతార, సమంత, లావణ్య త్రిపాఠి, అదితిరావు, దీపిక ఇలా అందరూ ఎర్రరంగు చీర కట్టుకున్నారు. ఎర్ర చీరను ప్రేమ, సంపద, కొత్త జీవితానికి సంకేతంగా చూస్తారు.