KMM: సత్తుపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు సకాలంలో అందడమే లక్ష్యంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి శుక్రవారం అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు.