కోనసీమ: జిల్లాలో డీజిల్ కొరత అంశంపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సోమవారం ఉదయానికి జిల్లాకు అవసరమైన ఆయిల్ సరఫరా అవుతుందని జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియాదేవి తెలిపారు. అమలాపురంలో ఉన్న జిల్లా కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. రెండు రోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వస్తాయని, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.