జగిత్యాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాలలో మట్టి కుండలు, గణేష్ విగ్రహాల తయారీపై వర్క్షాప్ నిర్వహించారు. మట్టి పాత్రలు ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేస్తాయని జిల్లా విద్యాధికారి కే. రాము తెలిపారు. లింగంపేటకు చెందిన కుమ్మరి మహిపాల్ విద్యార్థులకు సారెతో కుండల తయారీ ప్రదర్శించారు.