SDPT: అక్కన్నపేట మండలం పోతారం జె గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వర్షాధారిత పంటల అభివృద్ధి (RAD) పథకం కింద రైతులకు కూరగాయల పెట్టెలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూరగాయలు, ఆయిల్ ఫామ్, తేనెటీగలు, పట్టు వంటి ఆదాయపంటలు సాగు చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో 50–100 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు.