SRPT: కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామ సర్పంచ్ శరభయ్య తండ్రి రామారావు సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోదాడ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.