SRCL: సమస్యల పరిష్కారం కోరుతూ ‘చలో హైదరాబాద్’ కమిషనరేట్ ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను సోమవారం తంగళ్లపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్కు తరలించినా తమ పోరాటం ఆగదని ఆశా కార్యకర్తలు నినదించారు.